Thursday, April 25, 2024

ముఖ్రా(కే) గ్రామంలో జాతీయ జెండా రెప‌రెప‌లు..

రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌తంత్ర భారత వజ్రోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. కొన్ని చోట్ల వినూత్న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఉత్స‌వాలు ఆక‌ట్టుకుంటున్నాయి. నిర్మ‌ల్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కే గ్రామ ప‌రిధిలోని పంట పొలాల్లో జాతీయ జెండాల‌ను రైతులు రెప‌రెప‌లాడించారు. రైతులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాల‌న‌తో ఆనందంగా ఉన్నామ‌న్నారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి ప‌థ‌కాలు అమ‌లు చేసి, రైతుల జీవితాల‌ను మార్చార‌ని కొనియాడారు. అనంత‌రం గ్రామంలో జాతీయ జెండాల‌ను చేత‌బూని ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్రా కే గ్రామ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప స‌ర్పంచ్ వ‌ర్షతో పాటు సంజీవ్, మాధ‌వ్, తిరుప‌తి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement