Friday, March 29, 2024

ఎమ్మెల్యే సమీక్షా సమావేశం..

బెల్లంపల్లి : సింగరేణి ఏరియా జీఎం సంజీవ రెడ్డి, డాక్టర్‌ అనీల్‌తో.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా 2 వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తుండటంతో బెల్లంపల్లి ఐసోలేషన్‌ బెడ్లను, వెంటిలేటర్లను, సిబ్బందిని పెంచాలని, ఐసోలేషన్‌లో చేరిన ప్రతీ పేషెంట్‌కు బెడ్‌ను కేటాయించాలని, ఐసోలేషన్‌లో ఉన్న వెంటిలేటర్లను అవసరం ఉన్న పేషెంట్లకు ఉపయోగించాలని, వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు చెప్తూనే వారిలో మనోధైర్యాన్ని నింపాలని ఆదేశించారు. అదే విధంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరు బయటకు రావద్దని, బయటకు వస్తే మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, తరచూ కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన ప్రతీఒక్కరు, మే 1వ తేది నుండి 18 సంవత్సరాలు దాటిన ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement