Friday, March 29, 2024

మే డేను విజయవంతం చేయండి..

కాసిపేట : ప్రపంచ కార్మికుల దినోత్సవం 135వ మే డే దినోత్సవాన్ని కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు.మందమర్రి ఏరియా కాసిపేటగనిపై మే డే గోడ ప్రతులను విడుదల చేసిన అనంతరం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి ఉపాధ్యక్షులు దాగం మల్లేష్‌ మాట్లాడుతూ.. పని దినాల తగ్గింపు కోసం చికాగో నగరంలో అమర వీరుల పోరాట స్పూర్తిని కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న, తీసుకు వస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని, శనివారం రోజున జరిగే కార్యక్రమాలలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయమాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గని పిట్‌ కార్యధర్శి బియ్యాల వెంకటస్వామి, నాయకులు మీనుగు లక్ష్మినారాయణ, కామెర రాములు, శ్రీనివాస్‌, రవీందర్‌, రాజేందర్‌, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement