Friday, March 29, 2024

పెండ్లికి, శుభకార్యాలకి పర్మిషన్..

మంచిర్యాల : జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో పెళ్లిళ్ల సీజన్‌ వస్తుందని, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు తప్పనిసరిగా మండల తహశిల్దార్ల అనుమతి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హొళ్లికేరి సూచించారు. అబ్బాయి తరుపున 25 మంది, అమ్మాయి తరుపున 25 మంది మొత్తం 50 మందితో పెళ్లి చేసుకోవాలని, తప్పనిసరిగా పెళ్లికి సంబంధించిన ధరఖాస్తులను నింపి తహశిల్దార్లకు సమర్పించి అనుమతి తెచ్చుకోవాలని, ఎలాంటి శుభకార్యాలు చేసినా తహశిల్దార్ల అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆమె తెలిపారు. లేనియెడల కరోనా నిబంధనల ఉల్లంఘన చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement