Friday, April 19, 2024

నిర్మల్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గామంలో విషాదం నెలకొంది. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డ ఓ ప్రేమజంట ఉరివేసుకుని మృతిచెందారు. పొన్కల్ గ్రామానికి చెందిన కోండ నిశిత(18) మామడ జూనియర్‌ కళాశాలలో ఇటీవల ఇంటర్‌ పూర్తిచేసింది. ఇదే గామానికి చెందిన సిలివేరి హరీశ్‌(21) నిర్మల్‌ జిల్లా కేందంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరిది ఒకే కాలనీ కావడంతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ కులాలు వేరుకావడంతో పెద్దలకు తెలిస్తే ఒప్పుకోరని భావించారు. ఎలాగూ కలిసి జీవితాన్ని పంచుకోలేమని, కనీసం చావులోనైనా ఒకటవుదామని నిర్ణయించుకున్నారు. ఈ కమంలో నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హరీశ్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. వారు అనుకున్న ప్ర‌కారం ఇంటిలోని గదిలో ఇద్దరు ఒకే చీరకు ఉరేసుకున్నారు.

ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడానికి ముందు హరీశ్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌లో తాము చనిపోతున్న సమాచారాన్ని ఉంచాడు. ఇది చూసిన స్నేహితులు, కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. కుటుంబసభ్యులు అనుమానంతో వెతుకగా.. నిశిత ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. దీంతో ఇరువురి కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

ఇది కూడా చదవండి: తల్లితో సహజీవనం.. కూతురిని పెళ్ళి చేసుకుంటానని వేధింపులు

Advertisement

తాజా వార్తలు

Advertisement