Friday, April 19, 2024

కరోనాతో సీనియర్‌ జర్నలిస్టు మృతి

బెల్లంపల్లి : నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు చీర్ల సమ్మిరెడ్డి (45) కరోనాతో మృతి చెందారు. గత వారం రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించగా శ్వాస ఇబ్బంది తీవ్రం కావడంతో మృతి చెందినట్లు తెలిసింది. బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎంతో సుపరిచితమైన సమ్మిరెడ్డి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్టు సంఘాల సభ్యులు, పాత్రికేయులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆయన ముఖంపై ఎప్పటికి చిరునవ్వుతో పలకరించే పలుకులను ఎవరు మర్చిపోలేరు. మృతి చెందిన సమ్మిరెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. సమ్మిరెడ్డి మృతదేహాన్ని తన సొంత గ్రామం జిల్లెడకు తీసుకువచ్చి కోవిడ్‌ నిబంధనల మధ్య దహనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement