Thursday, April 18, 2024

జనహిత సేవా సమితీ..అన్నదానం

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదానం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాత గాజుల లావణ్య-కైలాస్‌ దంపతుల పెళ్లిరోజును పురస్కరించుకొని నిరుపేదలకు, బాటసారులకు, యాచకులు, కూలీల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ అన్నదానాల్లో అన్నదానం గొప్పదని, దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌, కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్‌, సహాయ కార్యదర్శులు జక్కుల శ్రీనివాస్‌గౌడ్‌, గౌరవ సలహాదారులు నిచ్చకోల రాజన్న, కార్యవర్గ సభ్యులు నిచ్చకోల గురుస్వామి, పెద్ది వినయ్‌కుమార్‌, గుమ్మల చందు, కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement