Tuesday, April 16, 2024

ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే..

బెల్లంపల్లి : ఐసోలేషన్‌ కేంద్రాన్ని 200 బెడ్లకు పెంచాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సింగరేణి ఏరియాసుపత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్‌ పీపీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో పెరుగుతున్న పాజిటీవ్‌ కేసులకు అనుగుణంగా ఐసోలేషన్‌ కేంద్రాన్ని 200 బెడ్లకు పెంచాలని, ఐసోలేషన్‌ కేంద్రంలో వెంటిలేటర్లు, సిబ్బందిని తక్షణమే పెంచాలని, సిటిస్కాన్‌ మిషన్‌ లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సిటి స్కాన్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరడంతో డైరెక్టర్‌ పీపీ స్పందించి హామీ ఇచ్చారు. ఐసోలేషన్‌ కేంద్రంలో అవసరమైన సిబ్బందిని తక్షణమే తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐసోలేషన్‌ కేంద్రంలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వైద్యులు తమను ఫోన్‌ ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎం సంజీవరెడ్డి, ఆసుపత్రి వైద్యుడు అనీల్‌, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement