Wednesday, April 24, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో హోంమంత్రి మహమూద్‌ అలీ ప‌ర్య‌ట‌న‌..

ఆసిఫాబాద్ జిల్లాలో హోం మంత్రి మహమూద్‌ అలీ ప‌ర్య‌టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం ఆయ‌న జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాగజ్‌నగర్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా కాగజ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరికి స్థానిక నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement