Tuesday, April 23, 2024

మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌..

చెన్నూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మహరాష్ట్రలోని సిరువంచ నియోజకవర్గ కేంద్రంలో భారీగా ఆదరణ లభిస్తుంది. మహరాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన సభకు సిరువంచ మాజీ ఎమ్మెల్యే దీపక్ అత్రం ఆధ్వర్యంలో సుమారు 20 వాహ‌నాల్లో భారీగా నాయకులు తరిలి వెళ్లారు. గత కొద్దరోజులుగా మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫొటోలోతో కూడిన ప్లెక్సీలను నియోజకవర్గ కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ ఆనుకొని ఉన్న సిరువంచ నియోజకవర్గంలోని ప్రజలు కేసీఆర్ పాలన సంక్షేమ పథకాల పట్ల ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement