Wednesday, April 17, 2024

పంచాయతీ సిబ్బంది.. ప్రజాప్రతినిధులకు కరోనా వ్యాక్సిన్..

కాసిపేట : మండలంలోని గ్రామ పంచాయతీ పారిశద్ద కార్మికులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు కరోన వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎంపిపి లక్ష్మి, ఎంపిడిఓ అలీం సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయం సమావేశం హాలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు తెలిపారు. ఈ నెల 10 నుండి రెండు రోజలు పారిశద్ద కార్మికులు, 12 నుండి రెండు రోజులు ఎంపిపి, జడ్పీటీసి, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 45 ఏల్ల వయస్సున్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌లు తీసుకోవాలని వివరించారు. కరోన వ్యాప్తి చెందకుండా అందరు మాస్క్‌, భౌతికదూరం, కరోన నిబందనలు పాటిస్తూ మహమ్మారి బారిన పడకుండా రక్షించుకోవాలని పేర్కోన్నారు. ఈ సమావేశంలో ఎపిఓ, పంచాయతీ కార్యధర్శులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement