Friday, April 19, 2024

కరోనా సోకిన వారికి త్వరగా వైద్యం..

బెల్లంపల్లి : కరోనా సోకిన వారికి వైద్య సిబ్బంది వెంటనే వైద్యం అందించాలని చాకెపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌ కోరారు. చాకెపల్లి గ్రామంలో హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడ సిబ్బందితో మాట్లాడి కరోనా పాజిటీవ్‌ వచ్చిన వారికి స్వయంగా ఫోన్‌ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేయాల్సిందిగా కోరారు. జాగ్రత్తగా మెడిసిన్‌ వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలుపుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా సబ్‌ సెంటర్‌ ఇంచార్జి ఉమాదేవి వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement