Wednesday, April 24, 2024

జాగ్రత్తలు తప్పనిసరి..

బెల్లంపల్లి : దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వన్‌టౌన్‌ సీఐ ముస్కె రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ కరోనా కట్టడి చేయడంలో భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. మాస్కులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని, అలా వస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement