Thursday, April 18, 2024

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ..

భీమిని: మండలం కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన జిల్లెల బక్కయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకోగా రూ.18వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును తెరాస నాయకులు బక్కయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్‌ సర్పంచ్‌ ముస్కు సురేష్‌, మాజీ ఎంపీటీసీ ముస్కు సుదర్శన్‌ గౌడ్‌, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement