Tuesday, April 23, 2024

మృతుడి కుటుంబానికి బీమా చెక్కు..

కాసిపేట : మండల కేంద్రానికి చెందన టీఆర్‌ఎస్‌ కార్యకర్త ముడిమడుగుల శంకర్‌ కొద్ది రోజుల కింద ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు పార్టీ నుండి మంజూరైన రెండు లక్షల రూపాయల భీమా చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి ఎన్నో విన్నూతన పతకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు సైతం అదే విధంగా ఆపద సమయంలో అండగా వుంటుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పిటీసి చంద్రయ్య, పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement