Tuesday, April 23, 2024

భాస్కరచారికి సన్మానం..

బెల్లంపల్లి : ఆసీఫాబాద్‌ జిల్లా విశ్వబ్రాహ్మణుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షునిగా రామోజి భాస్కరచారి ఎన్నికయ్యారు. జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని పటిష్టం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన భాస్కరచారి తెలిపారు. గత నెల 27న జరిగిన విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఎన్నికల్లో ఆసీపాబాద్‌ అధ్యక్షునిగా ఎన్నికైన రామోజీ భాస్కరచారి హైదరాబాద్‌లోని జీఆర్‌ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కరచారి, సురేష్‌చారిలను రాష్ట్ర నాయకులు ప్రమాణస్వీకారం చేయించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రోజు బిక్షపతి చారి, కుందారం గణేష్చారి, రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement