Tuesday, April 23, 2024

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న..

బెల్లంపల్లి : అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, జనహిత అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని, జనహిత సేవా సమితీ వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారికి ఎల్లవేళలా మా సహాయసహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రానున్న 21వ తేది బుధవారం నుండి అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుందని అన్నారు. ఈ అన్నదాన ప్రారంభ కార్యక్రమానికి అన్నదాతగా సేవా సమితీ గౌరవ సలహాదారుడు దాసరి స్వప్న-సత్యనారాయణ గౌడ్‌ దంపతులు వారి తల్లి దాసరి కాంతమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, తెరాస నాయకులు గడ్డం భీమాగౌడ్‌, కొమ్మెర లక్ష్మణ్‌, కోదండ రామాలయ చైర్మన్‌ రేణికుంట్ల శ్రీనివాస్‌, అమ్మ ఒడి ఎన్‌జీఓ హనుమాండ్ల మధూకర్‌, జనహిత సేవా సమితీ ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్‌, సహాయ కార్యదర్శి జక్కుల శ్రీనివాస్‌ గౌడ్‌, సభ్యులు ముర్కూరి బాలాజీ, నిచ్చకోల రాజన్న, గట్టు భీమాగౌడ్‌, గడ్డం రజినీకాంత్‌, సింగతి తిరుమల్‌, పెద్ది వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement