Friday, April 19, 2024

Adilabad: 12మంది ఆదివాసీ మహిళలకు బెయిల్ మంజూరు

ఆదిలాబాద్ జిల్లాలో 12మంది ఆదివాసీ మహిళలకు బెయిల్ మంజూరైంది. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని ఈనెల 1వతేదీన ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగైదు నెలలుగా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని నివాసముంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. లింగపూర్‌లోని కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 379లో చెట్లను నరికివేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులు ఎక్కువ చెట్లను నరికివేయకుండా అడ్డుకున్నారు. అంతే కాకుండా 24 మందిపై పది కేసులు పెట్టగా.. 12 మంది మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయిన 12మంది ఆదివాసీ మహిళలకు బెయిల్ మంజూరైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement