Thursday, April 18, 2024

సీఎం స‌భ‌కు భారీగా తరలిన జనం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బహిరంగ సభకు చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుండి భారీగా జనం తరలి వెళ్ళారు. జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభత్స‌వంతో పాటు బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు మేరకు చెన్నూరు పట్టణ గ్రామల ప్రజలు, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement