Saturday, April 20, 2024

వాటర్‌ చాలెంజ్‌ ఫర్‌ బర్డ్స్

మంచిర్యాల : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆకలిని, దాహాన్ని తీర్చుకునేందుకు అల్లాడిపోయే పక్షుల కోసం వాటర్‌ చాలెంజ్‌ ఫర్‌ బర్డ్స్‌ అనే కార్యక్రమాన్ని తెరాస యువ నాయకుడు బింగి ప్రవీణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటిపైన పక్షుల ఆకలిని తీర్చడం కోసం ఒక పాత్రలో ధాన్యం గింజలను, మరో పాత్రలో మంచినీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా పక్షిజాతి అంతరించిపోకుండా చేపట్టిన చాలెంజ్‌ను అందరు స్వీకరించి అందరు తమ తమ ఇంటి ప్రహారీగోడలపై గానీ, భవనం పైన గానీ ధాన్యం గింజలతో పాటు మంచినీటిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల మనం ఎన్నో రకాల జాతుల పక్షుల ప్రాణాలను కాపాడిన వారమవుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement