Friday, March 29, 2024

నూతన మురికి కాల్వ నిర్మాణ పనులు

బెల్లంపల్లి : మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామపంచాయితీలోని తెనుగుగూడెంలో సర్పంచ్‌ రాంటెంకి నిర్మల-హరికృష్ణ పంచాయితీ నిధులు రూ.6లక్షలతో నూతన మురికి కాల్వ నిర్మాణ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ చింతం విజయ, వెంకటస్వామి, డైరెక్టర్‌ రొడ్డ లక్ష్మి-సత్తయ్య, సహకార సంఘం మాజీ చైర్మన్‌ సింగతి పెద్దన్న, మాజీ సర్పంచ్‌ సింగతి సత్యనారాయణ, వార్డు సభ్యులు బోర్లకుంట అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement