Thursday, April 25, 2024

జనహిత సేవా సమితి.. చలివేంద్రం

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్‌ ఎస్ ఐ బి.రాజు, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌ సీఐ రాజు మాట్లాడుతూ జనహిత సేవా సమితీ వారు ప్రతీరోజు ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్‌ వాటర్‌తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ జనహిత సేవా సమితీ ఆవిర్భావం నుండి గత 5 సంవత్సరాలుగా వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, సహాయ కార్యదర్శి జక్కుల శ్రీనివాస్‌గౌడ్‌, సలహాదారులు మూర్కూరి బాలాజీ, దాసరి సత్యనారాయణగౌడ్‌, కార్యవర్గ సభ్యులు గొడిసెల శేఖర్‌, హనుమాండ్ల రమాదేవి, పంతంగి సంతోష్‌, గడ్డం సుధీర్‌గౌడ్‌, బానోతు విజయ్‌, లక్కాకుల శ్రీనివాస్‌, పన్నాల సదానందం, గాజుల కైలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement