Friday, March 29, 2024

ఘనంగా ‘షిర్డీసాయి బాబా’ 24వ వార్షికోత్సవం

బెల్లంపల్లి : బెల్లంపల్లిలోని బూద గెస్ట్‌హౌస్‌ సమీపంలో గల శ్రీషిర్డీ సాయిబాబా 24వ వార్షికోత్సవాన్ని ఆలయ చైర్మన్‌ ఆవునూరి దుర్గయ్య, ట్రస్టు సభ్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. కాగడ హారతి, అభిషేకం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, నవగ్రహాది మండప దేవతా స్థాపనం, అగ్ని ప్రతిష్ఠ అనంతరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో 5గురు వేద పండితులచే 24 కలషాలతో అర్చన, హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు కొమ్మెర లక్ష్మణ్‌, ఆలయ కమిటీ సభ్యుడు గరస శ్రీనివాస్‌, భక్తులు ఆకుల కుప్పు స్వామి, అలుగునూరి లవనేశ్వర్‌, సుద్దాల శ్రీనివాసచారి దంపతులచే హోమం నిర్వహించారు. అనంతరం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పసుల సునితారాణి ఆధ్వర్యంలో అన్నదానం, నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 గంటలకు సాయంత్ర హారతి, 6:30 గంటలకు శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాంపెల్లి విజయ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement