Wednesday, April 24, 2024

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు చేసిన ట్రైనీ ఎస్ఐలు

గణపురం:స్థానిక పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న కుమార్ గౌడ్,రాజేష్ రెడ్డి,విజయ్ కుమార్ లు శనివారం మండల కేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ప్రత్యేక పూజలునిర్వహించిన అనంతరం అభిషేకంలో పాల్గొన్నారు.వారికి ఆలయ పూజారి నరేష్ తీర్థ ప్రసాదాలు,ఆశీర్వచనాలు అందించారు.నూతనంగా శిక్షణ నిమిత్తం విధుల్లో చేరిన ఎస్ఐలను కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నాగపురి శ్రీనివాస్ గౌడ్ ,సభ్యులు గోనె తిరుపతి రావు,రౌతు కిషోర్,మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement