Thursday, March 28, 2024

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ చైర్మన్‌గా రేగుంట రాయలింగు

బెల్లంపల్లి : కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ బెల్లంపల్లి నియోజకవర్గ చైర్మన్‌గా రేగుంట రాయలింగును నియమిస్తూ మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రామగిర బానేష్‌లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేగుంట రాయలింగు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగరి ప్రీతప్‌, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు, జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement