Monday, March 25, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన నటి రాధిక శరత్ కుమార్, నటుడు సాయి కుమార్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయి కుమార్ లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement