Thursday, April 25, 2024

మహిళపై యాసిడ్ దాడి.. మాస్కులతో వచ్చిన దుండగులు..

ఆదిలాబాద్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటి పనులు చేసుకుంటున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పరారయ్యారు. యాసిడ్ ఒంటిపై పడడంతో మంటలు వ్యాపించి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉట్నూర్ మండలంలోని లక్కారం పంచాయతీలో జరిగింది. స్థానిక కేబీ నగర్‌కు చెందిన పుష్ప అనే మహిళ గురువారం ఉదయం ఇంటి బయట పనులు చేసుకుంటున్న క్రమంలో.. మాస్కులు ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వచి అమాంతం ఆమెపై యాసిడ్‌ పోశారు.

వెంటనే ఆమెను ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై, సీఐ ఆస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ దాడి ఎందుకు చేశారో.. ఎవరు చేశారో తనకు తెలియదని.. మాస్కులు పెట్టుకున్నారని బాధితురాలు చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement