Wednesday, April 24, 2024

Accident – కేశంపేట మండలంలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

కేశంపేట మండలం అల్వాల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన చెక్కల రామచంద్రయ్య, వెంకిర్యల గ్రామానికి చెందిన నర్సింలు, కృష్ణయ్య ,దశరథంలు బుధవారం రాత్రి కడ్తల మండలం ముక్త మాదారం గ్రామానికి ట్రాక్టర్ లో గడ్డిని నింపుకొని మధ్య రాత్రి బయలుదేరారు. ఆల్వాల్ గ్రామ ట్రాక్టర్ అదుపుతప్పడంతో ట్రాక్టర్ ఇంజన్ పైన కూర్చున్న రామచంద్రయ్య,నర్సింలు మృతి చెందారు మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement