Thursday, April 25, 2024

ఒంటరి మహిళ దారుణ‌ హత్య.. అర్ధరాత్రి తల్లీబిడ్డలపై కత్తులతో దాడి

తిమ్మాపూర్ (ప్రభ న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో అర్ధరాత్రి రెండు గంటలకు ఇంట్లోకి చొరబడి ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కాలనీకి చెందిన గుజ్జుల సులోచన(45) 20 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో తన తల్లి కొమ్మెర రాధవ్వ (75)తో కలిసి ఉంటుంది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా సులోచన, ఆమె తల్లి రాధవ్వపై దాడి చేయడంతో సులోచన అక్కడికక్కడే మృతి చెందింది.

తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై శీలం ప్రమోద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాల, దుండగుల నేపథ్యమా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement