Wednesday, April 24, 2024

16మందిపై దాడి చేసిన కుక్క‌ల గుంపు

16మందిపై దాడి చేసింది ఓ కుక్క‌ల గుంపు.ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ బాలాన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. బాలానగర్ పరిధిలోని వినాయక నగర్ లో ఓ వీధి కుక్క.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. 16 మందిపై దాడి చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఎగబడి కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని దాదాపు రెండు గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement