Tuesday, April 16, 2024

ఓయూలో స‌మాధి.. అస‌లేం జ‌రిగిందంటే…

న‌గ‌రంలోని ఉస్మానియా యూనివర్శిటీలో ఓ స‌మాధి కలకలం రేపింది. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక ఓ సమాధి విద్యార్థుల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. వివ‌రాలిలా… ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఈసీహెచ్‌-1 హాస్టల్‌కి సమీపంలో సమాధి ఉంది. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఆ సమాధిని చూసి భయ‌ప‌డ్డారు. ఇక్క‌డ స‌మాధి ఏంటంటూ.. ఏదైనా జంతువును చంపి ఇక్కడ పూడ్చిపెట్టారా…లేక.. ఇంకా ఏదైన జ‌రిగిందా అన్న‌ట్లు విద్యార్థులు అనుమానిస్తున్నారు.

అక్క‌డున్న స‌మాధిపై పూలు చ‌ల్లార‌ని, ఆ పూలు కూడా తాజాగా ఉండటంతో.. ఇటీవలే ఖననం చేసినట్లు తెలుస్తోందని అంటున్నారు. ఓయూ క్యాంపస్ మొత్తంలో ఇప్పుడు ఈ సమాధి హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా సెక్యూరిటీ గార్డులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. మరోవైపు ఇది భద్రతా వైఫల్యమే అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు వ‌చ్చి సమాధిని తవ్వి చూస్తే గానీ లోపల ఉన్నది ఏ డెడ్‌బాడీనో తెలియదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement