Friday, March 29, 2024

ఫ్రిడ్జ్ లో తాత శవం.. అంత్యక్రియలకు డబ్బులు లేక మనుమడు

వరంగల్ జిల్లా పరకాలలో దారుణం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు మనవడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన రిటైర్ట్ ఉద్యోగి బాలయ్య(93), తన మనవడు నిఖిల్ ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం పరకాలకు వచ్చి స్థిర పడ్డారు. పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాయి. భార్య నర్సమ్మ, కొడుకు హరికిషన్, మనువడు నిఖిల్ తో కలిసి ఉంటున్నారు. అయితే హరికిషన్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే అతని భార్య క డా చనిపోవడంతో మనుమడి మంచి చెడ్డలు తాత నానమ్మలే చూస్తున్నారు.

అయితే, బాలయ్య భార్య నర్సమ్మ మూడు నెలల క్రితం కరోనాతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఇంట్లో బాలయ్య, నిఖిల్ ఇద్దరే ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే ఫించన్ డబ్బులతోనే ఇద్దరూ జీవినం సాగిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం బాలయ్య అనారోగ్యతంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని మనవడు తాత మృతదేహాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్ లో కుక్కిపెట్టాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు మనవడిని అడిగారు. ఇంట్లో ఎలుకలు, ఇతర కీటకాలు చనిపోవడంతో వాసన వస్తుందని మేనేజ్ చేస్తూ వచ్చాడు. అయితే, మూడు రోజులుగా నిఖిల్  గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకొని చూడగా ఫ్రిజ్ లో కుక్కిపడేసిన బాలయ్య డెడ్ బాడీ కనిపించింది. దీంతో అవాక్కైన పోలీసులు నిఖిల్ ను ప్రశ్నించగా.. అంత్యక్రయలకు డబ్బుల్లేక ఫ్రిజ్ లో దాచానని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement