Saturday, April 20, 2024

తెలంగాణ‌లో కరోనాతో 49 మంది మృతి

తెలంగాణ‌లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… కొవిడ్‌ బారిన పడి 49 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. కరోనా నుంచి మరో 6,206 మంది బాధితులు కోలుకున్నారు.  రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,73,933 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,417గా ఉంది. ప్రస్తుతం 80,135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,352 మందికి క‌రోనా సోకింది. మేడ్చల్‌ జిల్లాలో 427, రంగారెడ్డి జిల్లాలో 483 కరోనా కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement