Tuesday, April 16, 2024

తెలంగాణ‌లో కొత్తగా 448 కరోనా కేసులు.. 5,166కు చేరిన యాక్టివ్‌ కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 448 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 8.06,572కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో 462మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5166కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 22, 601మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 272 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాల్లో 11, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 28, రంగారెడ్డిలో 37, సంగారెడ్డిలో 8 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement