Friday, March 29, 2024

మద్యం మత్తులో ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయం

మద్యం తాగి వాహనాలు నడిపించవద్దని పోలీసులు ఎంత చెప్పినా.. కొందరు అసలు పట్టంచుకోవడం లేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నిన్న దుండిగల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తాజా హైదరాబాద్ శివారు కొంపల్లిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి.

కొంపల్లిలోని బిగ్‌ బజార్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement