Tuesday, April 23, 2024

తెలంగాణలో 20 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో 20 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం రూరల్‌, గోదావరిఖని ఏసీపీలతోసహా 20 డీఎస్పీలను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ డీఎస్పీ వంగా రవిందర్‌ రెడ్డి మెట్‌పల్లి ఎస్డీపీవోగా బ‌దిలీ అయ్యారు. అక్కడ ఉన్న ఎండీ గౌస్‌ బాబాను మెట్‌పల్లి ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న డీఎస్పీ డీ రఘుచందర్‌ను స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఏసీపీగా, డీఎస్పీ పీ సదయ్యను మహబూబాబాద్‌ ఎస్డీపీవోగా, ఎస్‌ గిరి ప్రసాద్‌ను గోదావరిఖని ఏసీపీగా నియమించారు. గోదావరిఖని ఏసీపీ వీ ఉమేందన్‌ను హైదరాబాద్‌లోని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ జీ బస్వా రెడ్డి ఖమ్మం రూరల్‌ ఏసీపీగా, అక్కడ ఉన్న ఎస్‌ వెంకట్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని చీఫ్‌ ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

వెయింటింగ్‌లో ఉన్న బీవీ సత్యనారాయణను వికారాబాద్ ఎస్డీపీవోగా, అక్కడ ఉన్న ఏ సంజీవరావు హైదరాబాద్‌లోని చీఫ్‌ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న జీ కృష్ణను జనగాం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎస్‌ వినోద్‌ కుమార్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉన్న ఏ మహేశ్‌ను బెల్లంపల్లి ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎంఏ రహమాన్‌ను చీఫ్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు. మహబూబ్‌నగర్‌లో వెయిటింగ్‌లో ఉన్న బీ కృష్ణను మహబూబ్‌నగర్‌ ఎస్డీపీవోగా నియమించగా, అక్కడ ఉన్న జీ శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని చీఫ్‌ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ స్థానచలనం కల్పించారు. వరంగల్‌ డీఎస్పీ ఎన్‌ సుధీర్‌ను హైదరాబాద్‌లోని గోపాలపురం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న పీ వెంకట రమణను చీఫ్‌ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం వేచిఉన్న బీ గంగాధర్‌ను రాజేంద్రనగర్‌ ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఆర్‌ సంజయ్‌ కుమార్‌ను చీఫ్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 23 వేల మందికి కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement