Friday, March 29, 2024

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రమంతాపూర్ వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement