Thursday, April 18, 2024

Flash: బైక్‌ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం పులి గుంట సమీపంలో హద్నూర్ నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులు రహీమ్, మన్నన్ గా గుర్తించారు. ఈ సంఘటనలో రహీమ్ అక్కడికక్కడే మృతి చెందగా మన్నన్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement