Saturday, April 20, 2024

ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో.. 15మంది విద్యార్థుల‌కి క‌రోనా

మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది..కాగా రీసెంట్ గా మహబూబాబాద్‌లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో చదువుకునే 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి విద్యార్థులకు జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్‌, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు 51 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించగా.. 15 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు సూచించారు. జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement