Friday, April 19, 2024

షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది: వైద్యులు

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను తీర్చాలని వై ఎస్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ఆమె దీక్ష మూడో రోజుకు చేరుకుంది. షర్మిల ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. కరోనా నేపథ్యంలో షర్మిల మాస్క్ ను ధరించి దీక్షలో కూర్చున్నారు.

తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల మూడు రోజుల నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మొన్న ఆమె దీక్షను చేపట్టారు. అయితే ఒక్కరోజు మాత్రమే దీక్షకు అనుమతి ఉందంటూ పోలీసులు ఆమెను బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా ఆమె జాకెట్ కూడా చిరిగిపోయిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. అనంతరం షర్మిల తన ఇంటి వద్ద నుంచే దీక్ష చేపట్టారు. మరోవైపు షర్మిలను కలవడానికి, ఆమె దీక్షకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారు. దీంతో, ఎవరూ ఇక్కడకు రావద్దని షర్మిల టీమ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నేటితో షర్మిల తన దీక్షను ముగించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement