Friday, April 26, 2024

రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలి..BRS

పాదయాత్రలో ప్రగతిభవన్‌ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ప్రగతి భవన్ ని పేల్చేయాలి అన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసన తెలపాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు నర్సంపేట్ నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డిపై పీడీయాక్ట్ కేసు పెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement