Friday, April 19, 2024

రాఘవులు ఫ్యామిలీకి ఆంధ్రప్రభ భరోసా.. రూ.1,02,016 అందజేత..

భూపాలపల్లి, (ప్రభాన్యూస్) : గుండెపోటుతో చ‌నిపోయిన‌ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆంధ్ర‌ప్ర‌భ‌ స్టాఫ్ రిపోర్టర్ ముక్కెర రాఘవులు కుటుంబాన్ని ఆదివారం ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్, జీఎం పసునూరి భాస్కర్ ఆదేశాల మేరకు వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రభ కుటుంబం నుంచి రూ.1,02,016 ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాసరావు, వరంగల్ బ్రాంచ్ మేనేజర్ తిరుపతి రెడ్డి, ఉమ్మడి జిల్లా బ్యూరో తుమ్మల కృష్ణ రెడ్డి, రిపోర్టర్లు రాచర్ల ప్రభాకర్, బెల్లం తిరుపతి, అరిగెల జనార్దన్, కాయిత తిరుపతి, పాలిశెట్టి నరేష్, బుర్ర చక్రపాణి, పసునూటి రవి, యమసాని రాజు, జాడి రాజు, కేయు విష్ణు, గొర్రె చిట్టిబాబు, వొద్దుల మురళి, పావుశెట్టి శ్రీనివాస్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement