Saturday, April 20, 2024

బైకును ఢీకొట్టిన లారీ, భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. కలిచివేసిన బాలుడి ఆక్రందనలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోరం జరిగింది. విజయనగరం శివారులో ఓ బైక్​ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి జరిగింది. బైక్​పై తమ కుమారుడితో భార్యాభర్తలు వెళ్తున్నారు. వీరి బైక్​ని లారీ ఢీకొట్టడంతో భార్యా,భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కుమారుడిని స్వల్ప గాయాలయ్యాయి.

అయితే.. ప్రమాదం తర్వాత బాలుడి ఆక్రందనలు అక్కడున్న వారిని కలిచి వేశాయి. అమ్మా, నాన్నా మీకేం కాదు.. అంటూ బాలుడు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. అక్కడున్న వారిని ‘‘ప్లీజ్​ అంకుల్​ రక్తం తుడవండి’’ అంటూ వేడుకోవడంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement