Saturday, April 20, 2024

బ‌స్సును ఢీకొన్న లారీ : త‌ప్పిన భారీ ప్ర‌మాదం

బ‌స్సును ఓ లారీ ఢీకొన్న ఘ‌ట‌న‌ ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుడిహత్నూర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ‌ తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులున్నారు. అయితే బ‌స్సు టైర్లు మ‌ట్టిలో కూరుకుపోవ‌డంతో బ‌స్సు బోల్తాప‌డ‌కుండా ఆగిపోవ‌డంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. దీంతో ప్ర‌యాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement