Friday, March 29, 2024

ప్రైవేటు బస్సును ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి తీవ్ర‌గాయాలు


ఓ బ‌స్సును లారీ ఢీకొన్న ప్ర‌మాదంలో ముగ్గురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్‌ మేడిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. బస్సు కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను రాంప్రసాద్, శాంతాభాయ్, గొంతి మాత్రే గా గుర్తించారు. ఈ ప్ర‌మాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement