Wednesday, April 24, 2024

తెలంగాణలో తగ్గని కరోనా వేవ్..

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 363 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 402 హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,964 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,746గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 15,472 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,674 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement