Wednesday, April 24, 2024

గ్రేట‌ర్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో – బండి సంజ‌య్

హైదరాబాద్:టిఆర్ఎస్ కు మేయర్ ఎన్నిక‌ల‌లో ఎంఐఎం మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిప‌డ్డారు.. జీహెచ్ఎంసీ‌లో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయమని తేల్చేశారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ‌ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని చెప్పారు. టీఆర్‌ఎస్-ఎంఐఎం రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటు బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు. టీఆర్‌ఎస్ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు రుజువైందని బండి సంజయ్ చెప్పారు. సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement