Friday, April 19, 2024

కొత్తగూడెం జిల్లాలో కాల్పుల మోత… మావోయిస్టు మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. చర్ల అటవీప్రాంతంలో పోలీసుల. మావోయిస్టు వారోత్సవాలపై పక్కా సమాచారంతో పోలీసులు ఇవాళ తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ షురూ చేశారు. భద్రతా బలగాలను గమనించిన మావోలు కాల్పులు జరిపారు. ఒక మావోయిస్టు మృతదేహం ఘటన స్థలంలో పడివుండడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు గుర్తించారు. సంఘటన స్థలం నుంచి ఒక 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలదే పైచేయి కావడంతో మావోలు అక్కడ్నించి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: రేపు డిశ్చార్జి కానున్న ఈటల రాజేంధర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement