Tuesday, April 23, 2024

కుటుంబ క‌ల‌హాల‌తో.. త‌ల్లిని చంపిన కూతురు

నందిపేట్, (ప్రభా న్యూస్): తల్లి కూతుర్ల మధ్య జరిగిన గొడవ కారణంగా తల్లినే హత్య చేసింది కూతురు. ఈ సంఘటన నందిపేట మండలం లోని ఉమ్మేడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే నాగం నర్సు (52) తన భర్త భోజన్న చనిపోవడంతో 20 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది. తోడుగా హరిత ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగ తల్లి కూతుర్ల మధ్య కుటుంబ విషయాల్లో జరుగుతున్నాయని.. రెండు రోజుల క్రితం రెండవ కూతురైన అరుణ ఇంట్లో తొట్లే (ఫంక్షన్) జరిగింది. వచ్చిన వారిని నాగం నర్సు తిట్టగా పెద్ద కూతురు అయినటువంటి హరిత, నాగం నర్సు, మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కూతురు తల్లిని రోకలి దుడ్డుతో ఇష్టం వచ్చినట్టు మొహం పైన.. తల పైన కొట్టడంతో ఆమె చనిపోయింద‌ని.. రెండో కూతురు త‌న‌ భర్త అయినా గణపురం రవికి చెప్పింది. దాంతో ఆయన ఆయన నందిపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement