Friday, April 26, 2024

వైసీపీకి పొత్తులు అవసరం లే.. 20 ఏళ్లు జగనే సీఎం

వైసీపీకి పొత్తులు అవసరం లేదని ఆపార్టీ విజయసాయిరెడ్డి అన్నారు. భయపడేవారే పొత్తుల పెటుకుంటారని అన్నారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు కరువైందన్నారు. పొత్తులేనిదే చంద్రబాబు పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆధారపడి వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందన్నారు. జగనే సీఎంగా కొనసాగుతారని ధీమా వ్యక్తంచేశారు. తమపై సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఏ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. కాగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాలంటూ పొత్తుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించిన నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement